తమిళనాడు తూత్తుకుడిలో 400 కేజీల కొకైన్ పట్టివేత

తమిళనాడు తూత్తుకుడిలో 400 కేజీల కొకైన్ పట్టివేత

తమిళనాడులోని తూత్తుకుడిలో 400 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.శ్రీలంక నుంచి వీవోసీ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో  నౌకలోని టింబర్ కిందిభాగంలో భారీ మొత్తంగా 400 కేజీల కొకైన్‌ను గుర్తించారు. దీని మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడినుంచి వచ్చాయి.. ఎక్కడకు తరలిస్తున్నారనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు.