కాజీపేట, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం హనుమకొండ జిల్లా మడికొండ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కాజీపేట డివిజనల్ ఏసీపీ డేవిడ్రాజ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జహనాబాద్ జిల్లా ఫతేపూర్ ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అమీన్ ఖాన్, ఒడిశా లోని గజపతి జిల్లా సిరోంచకు చెందిన తపన్ పాణి ఈజీ మనీ కోసం గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించారు. ఒడిశాలో గంజాయి కొని హైదరాబాద్లో అమ్మేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 58 కిలోల గంజాయితో రైలులో కాజీపేటకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో మడికొండకు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు వెయిట్ చేస్తుండగా గమనించిన మడికొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో గంజాయి విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు రూ. 14 లక్షల విలువైన 58 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 58 కిలోల గంజాయి పట్టివేత
- వరంగల్
- November 18, 2023
లేటెస్ట్
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- గెలుపు కోసం బీఆర్ఎస్ మెజార్టీపై కాంగ్రెస్ ఫోకస్
- ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు
- బీఆర్ఎస్లో హైటెన్షన్.. ఒకవైపు కబ్జా కేసులు.. మరోవైపు కాంగ్రెస్ లో చేరికలు
- కేసీఆర్..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్రెడ్డి
- కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి, శనగ.. గిట్టుబాటు ధర లేక నిల్వ చేస్తున్న రైతులు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు