పలు హోటళ్లలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

పలు హోటళ్లలో  మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. తిప్పాపూర్ లోని గీతాభవన్ హోటల్లో తనిఖీ చేశారు అధికారులు. అక్కడి నుంచి కుళ్లిపోయిన ఫుడ్, చికన్, మటన్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్ యాజమాన్యానికి 5 వేల రూపాయలు జరిమానా విధించారు.