యాదాద్రి జిల్లాలో ఎస్జీటీల సీనియార్టీ లిస్ట్ రెడీ

యాదాద్రి జిల్లాలో ఎస్జీటీల సీనియార్టీ లిస్ట్ రెడీ
  • నేడు వెబ్​ ఆప్షన్లు

యాదాద్రి, వెలుగు : జిల్లాలో ఎస్జీటీ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ తుది దశకు చేరింది. స్కూల్​అసిస్టెంట్లు(ఎస్ఏ)గా ప్రమోషన్లు పొందడానికి అర్హులైన వారి సీనియార్టీ లిస్ట్​ రెడీ చేయడంతోపాటు ఖాళీలను గుర్తించారు. వీటికి సంబంధించిన లిస్ట్​ను స్కూల్​ ఎడ్యుకేషన్​కు జిల్లా ఆఫీసర్లు ఆదివారం పంపించారు. ఇటీవల 16 మంది ఎస్ఏలు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు పొంది మల్టీ జోన్​– 1 పరిధిలోని స్కూల్స్​లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎస్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు ఇస్తున్నారు.

 ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్ఏ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా 99 ఖాళీలను గుర్తించిన ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు అదే సంఖ్యలో ఎస్జీటీల్లో సీనియార్టీ లిస్ట్​ను రెడీ చేశారు. వీటికి సంబంధించిన వివరాలను డైరెక్టర్ ఆఫ్ స్కూల్​ ఎడ్యుకేషన్​కు పంపించారు. ​ ప్రమోషన్లకు సంబంధించి ఎస్జీటీలు సోమవారం వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రమోషన్లలో ఎస్సీ టీచర్లకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 26తో ముగియనుంది. ప్రమోషన్లు పొందిన టీచర్లు 27న స్కూల్స్​లో జాయిన్​ కావాల్సి ఉంటుంది.