
చత్తీస్గఢ్ లో శుక్రవారం జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణ్ పూర్, దంతెవాడ, కొండెగావ్జిల్లాల బార్డర్లోని బస్తర్ డివిజన్లో.. ముంగేడీ – -గోబేల్ గ్రామాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారని పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో 45వ బెటాలియన్ ఐటీబీపీకి చెందిన 1,200 మంది జవాన్లు గురువారం కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లారు.
బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. శుక్రవారం తిరిగి వస్తున్న క్రమంలో గోబేల్అడవుల్లో మావోయిస్టులు అటకాయించారు. బలగాలపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో బలగాలు మావోయిస్టులను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.