భారీ అగ్నిప్రమాదం..15కు పైగా ఇళ్లు దగ్ధం

భారీ అగ్నిప్రమాదం..15కు పైగా ఇళ్లు దగ్ధం

జమ్ము కశ్మీర్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బారాముల్లా జిల్లా కేంద్రానికి సమీపంలోని నూర్ బాగ్ లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15కు పైగా ఇళ్లు కాలిపోయాయి. గ్యాస్ లీకేజీతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటలు అంటుకున్న తర్వాత.. వేడికి పక్క ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందన్నారు.