జమ్ము కశ్మీర్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బారాముల్లా జిల్లా కేంద్రానికి సమీపంలోని నూర్ బాగ్ లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15కు పైగా ఇళ్లు కాలిపోయాయి. గ్యాస్ లీకేజీతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటలు అంటుకున్న తర్వాత.. వేడికి పక్క ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందన్నారు.
#WATCH | J&K: Several houses gutted in a fire in Noorbagh area of Baramulla district. pic.twitter.com/3hco4jJvzv
— ANI (@ANI) June 10, 2021