ప్రధాని మోదీ రోడ్‌షోలో అపశ్రుతి.. జబల్‌పూర్‌లో కుప్పకూలిన వేదిక 

ప్రధాని మోదీ రోడ్‌షోలో అపశ్రుతి.. జబల్‌పూర్‌లో కుప్పకూలిన వేదిక 

మధ్యప్రదేశ్‌: జబల్‌పూర్‌లో ఆదివారం జరిగిన ప్రధాని రోడ్‌షోలో అపశ్రుతి చోటుచేసుకుంది. జబల్‌పూర్‌లో ఏప్రిల్ 7న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నరేంద్ర మోదీ చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రోడ్‌షో ఏర్పాటు చేసిన ఓ స్టేజ్ కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వేదిక కూలిపోగానే అక్కడ తొక్కీసలాట జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. రోడ్‌షోలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ దూబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ కూడా ఉన్నారు.