
ఉత్తర భారత దేశంలో చలి పంజా విసురుతోంది. పొగ మంచుకు తోడు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా సూర్యుడు దర్శనం ఇవ్వడం లేదు. ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల ప్రజలు చలి మంటలు కాచుకుంటున్నారు. మరోవైపు దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301 గా నమోదైంది. ఈ నెల చివరి వరకు చలిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఫుట్ పాత్ లపై నిద్రపోయే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Delhi's air quality remains in the 'very poor' category, with overall AQI at 301 as per System of Air Quality and Weather Forecasting And Research (SAFAR)-India pic.twitter.com/hfyV8GcFbg
— ANI (@ANI) January 16, 2022