
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ –2 డివిజన్పరిధిలోని ఓపెన్కాస్ట్–3 ప్రాజెక్ట్లో గురువారం సెకండ్షిప్ట్లో ప్రగతి షావల్ మెషీన్ బోల్తా పడి ఆపరేటర్తీవ్రంగా గాయపడ్డాడు. దసరా రోజు బొగ్గు ఉత్పత్తి చేసేందుకు మేనేజ్మెంట్కొందరు కార్మికులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా బొగ్గును షావల్మెషీన్ ద్వారా డంపర్లలోకి నింపుతుండగా.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మెషిన్ లోయలో పడిపోయింది. దీంతో ఆపరేటర్యెంజాల లక్ష్మినారాయణ తలకిందులుగా పడిపోగా, ఆయనకు తల లోపల, మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్లోని ఒమెగా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం తలకు ఆపరేషన్ చేయగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సింగరేణి ఆఫీసర్లు తెలిపారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో దారి కనిపించకపోవడం, షావల్నడిచే దారి ఇరుకుగా ఉండడం, పని ప్రదేశంలో లైటింగ్లేకపోవడం, బొగ్గును లోడ్ చేస్తుండగా ఆటోమెటిక్గా మెషీన్ మూవ్ కావడంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
ఆపరేటర్మద్యం తాగి వెహికల్నడిపాడని ఆఫీసర్లు తప్పుడు ప్రచారం చేశారని, ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహించాలని ఏఐటీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్జిగురు రవీందర్, సీఐటీయూ బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్ తెలిపారు.