మోదీగారు మీరు గ్రేట్ : లేఖ రాసిన శిల్పాశెట్టి

మోదీగారు మీరు గ్రేట్ : లేఖ రాసిన శిల్పాశెట్టి

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి  ప్రధాని మోదీకి లేఖ రాశారు.   మోదీగారు మీరు చాలా  గ్రేట్  అంటూ..... అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మోదీ చేసిన కృషిని ప్రశంశిస్తూ.. కృతఙ్ఞతను  లేఖ ద్వారా తెలిపారు. హిందువుల ఐకానిక్​ అయోధ్యలో  రామ మందిరాన్ని నిర్మించి.. బాలక్​ రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి  లక్షలాది మంది  ప్రజల కలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషిచేశారని నటి శిల్పాశెట్టి తెలిపారు.  మీరు ( ప్రధాని మోది) 500 ఏళ్ల రామజన్మభూమి చరిత్రను తిరగరాసినందుకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు.. ఇంతటి మహత్కర శుభకార్యాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు అని హిందీలో రాసిన  లేఖలో పేర్కొన్నారు. 

అయోధ్యలో రామ మందిరం కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి  namo@bjpcc.org అనే ఇమెయిల్ ఐడి ద్వారా  ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను కూడా మెయిల్ చేయవచ్చని తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ సోషల్​ మీడియాలో  ఈ లేఖ వైరల్​ అవుతుంది.  మరాఠీలో  ప్రముఖ నటి @TheShilpaShetty ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ధన్యవాదాలు తెలిపారు.  శ్రీరాముడు 5 శతాబ్దాలు వనవాసం చేశారంటూ... చివరకు మోదీజీ కృషి వల్ల ఆ వనవాసం ముగిసిందని ఇందుకు  శిల్పాశెట్టి   కృతఙ్ఞతలు తెలిపారు. జనవరి 22న బాలక్​ రాముడి ప్రతిష్ట  కార్యక్రమం జరిగింది.  ఇందులో ముఖేష్ అంబానీ , నీతా అంబానీ, అమితాబ్ బచ్చన్, అలియా భట్ , రణబీర్ కపూర్ , కంగనా రనౌత్ , మాధురీ దీక్షిత్ , రోహిత్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు.