
క్రికెటర్ గా అరంగేట్రం చేసిన తర్వాత తొలి మ్యాచ్ లోనే గెలవడం ఏ ఆటగాడికైనా ప్రత్యేకమే. అదే ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు జట్టు వరుస పెట్టి విజయాలు సాధిస్తుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. టీమిండియాకు ఆల్ రౌండర్ శివమ్ దూబే విషయంలోనూ అలాగే జరిగింది. ఈ ఆల్ రౌండర్ భారత జట్టుకు గోల్డెన్ లెగ్ లా మారాడు. అతడు జట్టులో ఉంటే చాలు విజయం ఖాయం అనేలా ఉంది. దూబే ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన చివరి 36 మ్యాచ్ ల్లో విజయం సాధించడం విశేషం. తాజాగా ముగిసిన ఆసియా కప్ లోనూ టీమిండియా వరుస విజయాలు సాధించిన జట్టులో దూబే ఉన్నాడు.
ఆసియా కప్ 2025లో దూబే అద్భుతంగా రాణించాడు. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన దూబే.. ఆ తర్వాత నిలకడగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్య ఫైనల్లో లేకపోవడంతో కొత్త బంతితో బౌలింగ్ చేసిన దూబే.. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ లోనూ రాణించి కీలక సమయంలో 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
Also Read : శాంసన్ రివెంజ్ తీర్చిన టీమిండియా క్రికెటర్లు
2019 లో బంగ్లాదేశ్ పై మ్యాచ్ తో దూబే భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం వెస్టిండీస్ పై తొలి వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. దూబే ఇప్పటివరకు 4 వన్డేలు.. 41 టీ20 మ్యాచ్ లాడాడు. 2019 డిసెంబర్ నుంచి దూబే ప్లేయింగ్ 11లో ఉన్న ప్రతి మ్యాచ్ లోనూ భారత్ గెలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దూబేను టీమిండియా ప్రతి మ్యాచ్ లో ఆడించాలని కొంతమంది అంటుంటే.. దూబే భారత జట్టుకు దొరికిన వరం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఐదేళ్ల క్రితం అరంగేట్రం చేసినా ఐపీఎల్ 2024 తర్వాత ఈ ముంబై ఆల్ రౌండర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన చివరి రెండు టీ20ల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఆసియా కప్ 2025లో దూబే అద్భుతంగా రాణించాడు. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా బౌలింగ్ లో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన దూబే.. ఆ తర్వాత నిలకడగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్య ఫైనల్లో లేకపోవడంతో కొత్త బంతితో బౌలింగ్ చేసిన దూబే.. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ లోనూ రాణించి కీలక సమయంలో 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.