గ్లామర్ రోల్స్తో ఆకట్టుకునే శ్రద్ధా దాస్.. తాజాగా సింగర్గా కూడా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుంది. ఆమె నటించిన ‘పారిజాత పర్వం’ చిత్రంలోని ఓ పాటను పాడింది. చైతన్య రావు, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి సోమవారం శ్రద్ధా దాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రంగ్ రంగ్ రంగీలా’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.
మ్యూజిక్ డైరెక్టర్ రీ ఈ పాటను కంపోజ్ చేయగా, శ్రద్ధా దాస్ పాడింది. ‘రంగ్ రంగ్ రంగీలా.. ఓంకార్ బార్.. రకరకముల చిత్రాలా.. మాయా బజార్.. మక తిక మక మైకాలా.. మస్తీ విహార్.. జర జర జర పైలం పిలగో పారా హుషార్’ అంటూ తాగుబోతులపై రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు.
బార్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ పాటలో శ్రద్ధా దాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఇంప్రెస్ చేశాయి. సునీల్, హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్నారు.