భారత ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా

భారత ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్, గగన్ యాన్ వ్యోమగామి శుభాన్షు శుక్లా యాక్సియోమ్–4 అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 2025, జూన్ 22కు రోదసి యాత్ర పోస్ట్ పోన్ అయ్యింది. అమెరికాకు చెందిన ఆక్సియమ్ స్పేస్ ప్రైవేట్ కంపెనీ ‘యాక్సియోమ్–4’ పేరుతో చేపట్టిన కమర్షియల్ మిషన్‎లో భాగంగా శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఈ మిషన్ ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. 

జూన్ 11న జరగాల్సిన ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా జూన్ 19కి వాయిదా వేశారు. ఫ్లోరిడా ప్రాంతంలో గురువారం (జూన్ 19) కూడా వాతావరణం సరిగ్గా ఉండదన్న అంచనాలతో ప్రయోగాన్ని జూన్ 22కు వాయిదా వేస్తున్నట్టు నాసా బుధవారం ప్రకటించింది. కాగా, వాణిజ్య మిషన్‌కు కమాండర్ పెగ్గీ విట్సన్ నాయకత్వం వహించనుండగా.. శుభాన్షు శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరించనున్నాడు. హంగేరీకి చెందిన ఆస్ట్రోనాట్ టిబోర్ కాపు, పోలాండ్‌కు చెందిన వ్యోమగామి స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ మిషన్ స్పెషలిస్ట్‌లు పని చేయనున్నారు. స్పేస్‌ఎక్స్‌‎కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వీరు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

►ALSO READ | ఇండోనేషియాలో బద్దలైన భారీ అగ్ని పర్వతం.. బాలి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే రివర్స్