ఫిబ్రవరిలో ‘టిల్లు 'స్క్వేర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మరో కొత్త మూవీకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమా లతో ఈ చిత్రాన్ని ప్రారంభించగా.. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టినట్టు తెలియజేశారు.
ఓ స్ట్రైకింగ్ పోస్టర్తో ఈ అప్డేట్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై రూపొందనున్న 37వ సినిమా ఇది. ఈ చిత్రం కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని మేకర్స్ చెప్పారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించే సిద్ధు జొన్నలగడ్డ మరో కామెడీ ఎంటర్టైనర్లో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.