అక్కడి దాచింది ఎవరు: మట్టి తవ్వుతుంటే.. వెండి నాణాలు దొరికాయ్

అక్కడి దాచింది ఎవరు: మట్టి తవ్వుతుంటే.. వెండి నాణాలు దొరికాయ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు వెండి నాణేలు గురిగి దొరికాయి.  కూలీలు గురిగిని పగలగొట్టి నాణేలను పంచుకున్నారు.  ఈ విషయం  తెలిసిన  అధికారులు, తహసీల్దార్ గ్రామంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని  విచారణ చేపట్టారు. 

నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కూలీలను  తహసీల్దార్ ఆదేశించారు.. గురిగిలో మొత్తం 27 వెండి నాణేలు దొరికినట్టు ఉపాధి హామీ కూలీలు  చెప్పారు.  కూలీల  దగ్గర నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. దొరికిన నాణేలు  మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలామణిలో   ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది.