
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం వెండి ధర రూ.1,000 పెరిగి కిలోకు రూ.1,08,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. శనివారం (June 7) దీని కిలో ధర రూ.1,07,100 వద్ద ముగిసింది.
వ్యాపారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్కారణంగా ధరలు పెరిగాయని అసోసియేషన్ పేర్కొంది. డాలర్ బలహీనపడటం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా వెండి ధరలను పెంచాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర సోమవారం 10 గ్రాములకు రూ.280 తగ్గి రూ.97,780కి చేరుకుంది.
శనివారం ధర 10 గ్రాములకు రూ.1,630 తగ్గి రూ.98,060కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.97,350కి చేరుకుంది. మునుపటి మార్కెట్ ముగింపులో ఇది 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.97,600కి చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్సు (28.3 గ్రాములు) ధర స్వల్పంగా పెరిగి 3,312.84 డాలర్లకు చేరుకుంది. ఔన్సు సిల్వర్ ధర 0.9 శాతం పెరిగి 36.30 డాలర్లకు చేరుకుంది.