ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో సింధు, శ్రీకాంత్‌‌‌‌

ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో సింధు, శ్రీకాంత్‌‌‌‌

పారిస్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌కు చేరారు. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో సింధు 20–22, 22–20, 21–19తో మాజీ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ మిచెల్లీ లీ (కెనడా)పై గెలిచింది. గంటా 20 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌‌‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మిచెల్లీ క్రాస్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ విన్నర్లతో రెచ్చిపోయింది. 

అయితే రెండో గేమ్‌‌‌‌లో ఓ దశలో 6–14తో వెనకబడ్డ తెలుగమ్మాయి తర్వాత బలమైన స్మాష్‌‌‌‌లతో చెలరేగింది. వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌‌‌‌ నెగ్గింది. డిసైడర్‌‌‌‌లో ఇద్దరి స్కోరు 17–17 సమమైన దశలో సింధు వరుసగా మూడు పాయింట్లు నెగ్గింది. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో శ్రీకాంత్‌‌‌‌ 21–15, 20–22, 21–8తో చోయు టియాన్‌‌‌‌ చెన్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ)ను ఓడించాడు. మరో మ్యాచ్‌‌‌‌లో ఏడోసీడ్‌‌‌‌ హెచ్‌‌‌‌.ఎస్‌‌‌‌. ప్రణయ్‌‌‌‌ 17–21, 17–21తో లు గుయాంగ్‌‌‌‌ జు (చైనా) చేతిలో కంగుతిన్నాడు.