సింగరేణి బొగ్గు గనుల్లో సేఫ్టీ మెథడ్స్ పాటించాలి : హైదరాబాద్ రీజియన్ డీఎంఎస్ నాగేశ్వరరావు

సింగరేణి బొగ్గు గనుల్లో సేఫ్టీ మెథడ్స్ పాటించాలి : హైదరాబాద్ రీజియన్ డీఎంఎస్ నాగేశ్వరరావు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి గనుల్లో ప్రమాదాల నివారణకు మేనేజ్​మెంట్​ తగిన రక్షణ చర్యలు చేపట్టాలని హైదరాబాద్​ రీజియన్​ డైరెక్టర్​ ఆఫ్​ మైన్స్​ సేప్టీ(మైనింగ్) ఎన్.నాగేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరిఖని సింగరేణి ఎల్లందు క్లబ్​ కాన్ఫరెన్స్​ హాల్​లో సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం లలిత్​ కుమార్​ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య అధ్యక్షతన రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఎస్​ మాట్లాడుతూ.. గనుల్లో ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గేలా, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇందుకు సంబంధించి ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం గనుల్లో జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులను స్మరిస్తూ అధికారులు, యూనియన్​ నాయకులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఎలక్ట్రికల్​ డీఎంఎస్​ రాజ్​కుమార్​, సింగరేణి డైరెక్టర్​ ఎల్.వి.సూర్యనారాయణ, సేప్టీ జీఎం చింతల సూర్యనారాయణ, డీడీఎంఎస్​లు దిలీప్​కుమార్​, రాజీవ్​ ఓంప్రకాశ్​వర్మ, కనకం ప్రేమ్​ కుమార్, రీజియన్​ సేప్టీ జీఎం ఎస్​.మధుసూధన్​, రెస్క్యూ జీఎం శ్రీనివాసరెడ్డి, ఏరియా సేప్టీ ఆఫీసర్​ సాయిప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.