- మంచిర్యాల టౌన్ లో రెండు రోజుల పాటు నిర్వహణ
- పాల్గొన్న 220 మంది కార్మిక, ఉద్యోగ కళాకారులు
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్ క్లబ్లో సింగరేణి కంపెనీ లెవల్కల్చరల్మీట్ మంగళవారంఅట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజులు నిర్వహించే కంపెనీ లెవల్మీట్లో భజన్, గజల్, ఫోక్ సాంగ్స్, లైట్మ్యాజిక్, గీత్, కీర్తన, భరతనాట్యం, కూచిపూడి, హ్యుమరస్స్కిట్ ఆర్కెస్ట్రా, ఫోక్డ్యాన్స్ అంశాలపై పోటీలు జరుగనున్నాయి. ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక, ఉద్యోగ కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఏటా ఏరియా, రీజియన్, కంపెనీ లెవల్లో కల్చరల్ పోటీలు నిర్వహిస్తుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలకు సంబంధించిన శ్రీరాంపూర్,రామగుండం–1,2,3, -భూపాలపల్లి, ఇల్లందు, -మణుగూరు,కొత్తగూడెం -కార్పొరేట్, మందమర్రి- బెల్లంపల్లికి చెందిన 220 మంది కార్మిక, కళాకారులు పోటీ పడుతున్నారు. ఇందులో గెలుపొందినవారు మహారాష్ట్రలోని నాగ్పూర్లోని ఈ నెల 25 జరిగే కోలిండియా కల్చరల్ మీట్లో పాల్గొంటారు.
