కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి .. కేంద్ర మంత్రులను కోరిన సింగరేణి అధికారులు

కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి .. కేంద్ర మంత్రులను కోరిన సింగరేణి అధికారులు

గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా సింగరేణి ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలని కోల్​మైన్స్​ఆఫీసర్స్​ అసోసియేషన్​సింగరేణి బ్రాంచ్​ప్రతినిధులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​రెడ్డి, సహాయ మంత్రి సతీశ్​చంద్ర దూబేకు విజ్ఞప్తి చేశారు. గురువారం వారు హైదరాబాద్​లో కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఆఫీసర్లకు వర్తింపజేసినట్టుగా సింగరేణి ఆఫీసర్లకు గ్రేడ్​లను కల్పించాలని కోరారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. సింగరేణి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుళ్లినట్టు చెప్పారు.  కోల్​ఇండియా లిమిటెడ్​అఫెక్స్​కమిటీ జనరల్​సెక్రటరీ డి.సాహూ, సింగరేణి బ్రాంచ్​ ప్రెసిడెంట్​లక్ష్మిపతి గౌడ్​, వైస్​ ప్రెసిడెంట్​ పొనుగోటి శ్రీనివాస్, ఏరియా ప్రెసిడెంట్​ కె.వెంకటేశ్వర్ రెడ్డి,  సెక్రటరీ హరిప్రసాద్ ఉన్నారు.