సమస్యలు పరిష్కరించాలని రిటైర్డ్ సింగరేణి కార్మికుల నిరసన ..పెన్షన్ పెంచాలని గోదావరిఖనిలో ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని  రిటైర్డ్  సింగరేణి కార్మికుల నిరసన ..పెన్షన్ పెంచాలని గోదావరిఖనిలో  ఆందోళన

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రిటైర్డ్​కార్మికులకు కనీస పెన్షన్​ రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సోమవారం గోదావరిఖని సింగరేణి స్టేడియం వద్ద రిటైర్డ్​ కార్మికులు సమావేశమై ఆందోళన చేపట్టారు. 

27 ఏండ్లుగా పెంపుదలకు నోచుకోని కోల్‌‌‌‌మైన్స్ పెన్షన్‌‌‌‌ను కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ వెంటనే చెల్లించాలని, సీపీఆర్​ఎంఎస్​ స్కీమ్​ కింద వైద్య సౌకర్యం కోసం రిటైర్డ్​ ఉద్యోగులకు కూడా రూ.25 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. 

సింగరేణిలో మారుపేర్లను సరి చేయాలని, సంస్థలో కొత్తగా అండర్ గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభించాలని, అర్హులైన రిటైర్డ్​ఉద్యోగులకు వైట్ రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి ఆల్​రిటైర్డ్​ఎంప్లాయీస్​వెల్ఫేర్​అసోసియేషన్​ లీడర్లు ఎండీ రఫీక్‌‌‌‌, కొమ్ముల సంజీవ్, షేక్​ కలీం అహ్మద్, సర్వర్​ పాష, నగునూరి శంకర్​, సమ్మయ్య, కొమురయ్య, రాజిరెడ్డి, మొగిలి పాల్గొన్నారు.