
గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జూన్ నెలలో 94 శాతం బొగ్గు వెలికితీసినట్టు జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు. మంగళవారం తన ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ఆర్జీ 1 ఏరియాలో ఓపెన్కాస్ట్–5 ప్రాజెక్ట్ 106 శాతం సాధించి ఉత్పత్తిలో ముందున్నదన్నారు. సంక్షేమంలో భాగంగా సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. రూ.15 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
కార్మిక కుటుంబాలకు శుద్ధమైన వాటర్ అందించేందుకు రాపిడ్ గ్రావిటీ ప్లాంట్నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు వెల్లడించారు. ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, సింగరేణికి సంబంధించిన అంశాలు ఈ సమ్మె డిమాండ్లలో ఏవీ లేవన్నారు. మీటింగ్లో ఆర్జీ వన్ మేనేజర్(పర్సనల్) రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయులు, ఆంజనేయప్రసాద్, శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంత్ రావు, వేణు, పాల్గొన్నారు.