
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికులకు సొంతిళ్లు కావాలా వద్దా.. అనే అంశంపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఈనెల11, 12 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి తెలిపారు. ఆదివారం యూనియన్ ఆఫీస్లో జరిగిన ఆర్జీ – 1 ఏరియా బ్రాంచ్ కమిటీ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
కార్మికులు నివసిస్తున్న కంపెనీ క్వార్టర్స్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కార్మికులకు సొంతిండ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మీటింగ్లో ఏరియా ప్రెసిడెంట్ రాజమౌళి, సెక్రటరీ శ్రీనివాస్, లీడర్లు ఎస్.వెంకన్న, కె.రాజన్న, రవి, నారాయణ, శివరామిరెడ్డి, సాగర్, దుర్గా ప్రసాద్, ఎన్.రమేశ్, వి.సాగర్, రవిప్రసాద్ పాల్గొన్నారు.