స్కూల్లో సరిపడా గదులు లేక విద్యార్థులకు గుడిలో పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలోని ఎంపీపీఎస్లో 29 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇటీవల ప్రీ ప్రైమరీ తరగతులు కూడా మంజూరయ్యాయి.
అయితే ఈ స్కూల్లో గతంలో రెండు గదులు మాత్రమే ఉండగా.. శిథిలావస్థకు చేరడంతో ఒక గదిని కూల్చేశారు. ప్రస్తుతం ఒక్క గది మాత్రమే మిగిలింది. అది సరిపోకపోవడంతో పక్కనే ఉన్న గుడిలో తరగతులు నిర్వహిస్తున్నారు. కొత్త పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ కిషన్ కోరారు. -
