రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల ట్రాన్స్ఫర్ : సీపీ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల ట్రాన్స్ఫర్ : సీపీ అంబర్ కిశోర్ ఝా

మంచిర్యాల, వెలుగు: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిశోర్ ఝా మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. మందమర్రి ఎస్సై సురేశ్​ను నెన్నెల ఎస్​హెచ్​వోగా, నీల్వాయి ఎస్​హెచ్​వో పి.శ్యామ్ పటేల్​ను రామగుండం వీఆర్​కు, కన్నెపల్లి ఎస్​హెచ్​వో సీహెచ్.గంగారాంను దేవాపూర్ ఎస్​హెచ్​వోగా, ఇక్కడ పనిచేస్తున్న ఎ.ఆంజనేయులును కాసిపేట ఎస్​హెచ్​వోగా, అక్కడ పనిచేస్తున్న వి.ప్రవీణ్​కుమార్​ను వీఆర్​గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. 

ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్​హెచ్​వో బండి రామకృష్ణను తాళ్లగురిజాలకు, అక్కడ పనిచేస్తున్న సీహెచ్.రమేశ్ ములుగు జిల్లా వీఆర్​కు, మంచిర్యాల ఎస్సై 2గా ఉన్న సీహెచ్.కిరణ్​కుమార్​ను బెల్లంపల్లి టూటౌన్ ఎస్​హెచ్​వోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. కన్నెపల్లి ఎస్​హెచ్​వోగా సీసీఎస్ భూపాలపల్లిలో ఉన్న కె.భాస్కర్​ను బదిలీ చేశారు.