విషం పెట్టి కుక్కలను చంపారు

విషం పెట్టి కుక్కలను చంపారు

మహారాష్ట్రలోని థానేలో గుర్తు తెలియని వక్తులు పెంపుడు జంతువులపై విష ప్రయోగం చేసి చంపారు.  థానే జిల్లాలోని గణేష్‌పురి ప్రాంతంలో 6 కుక్కలకు విషం ఇచ్చి చంపినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.  భివాండి నివాసం ఉంటున్న  మనీషా పాటిల్ రెండు పెట్ డాగ్స్ ఫిబ్రవరి 21న ఉదయం వాంతులు చేసుకోని చనిపోయాయి.  పోలీసులకు చెప్పడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారి తెలిపారు.  అదే ప్రాంతానికి చెందిన మరో ముగ్గురి పెంపుడి కుక్కలు కూడా చనిపోయాయి. వీటితో పాటు ఓ వీధి కుక్క కూడా మరణించింది.  మొత్తం ఆరు కుక్కలు విష ప్రయోగం వల్ల చనిపోయాయి.