విమానం కుప్పకూలి.. 11మంది మృతి

విమానం కుప్పకూలి.. 11మంది మృతి

అడ్వెంచర్​కు బయలుదేరిన బృందం అనూహ్యంగా మృత్యువాతకు గురైన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. హవాయి స్టేట్​లో శనివారం ఓ పారాచూట్ స్కై డైవింగ్ సంస్థకు చెందిన  విమానం కుప్పకూలడంతో  సిబ్బంది, అడ్వెంచరిస్టులు కలిపి మొత్తం11 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011 తర్వాత అమెరికాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం ఇదే కావడం గమనార్హం. సదరు స్కై డైవింగ్​ సంస్థ ఓహు ఐలాండ్​ కేంద్రంగా పనిచేస్తున్నదని, శనివారం ఫీట్​ నిర్వహించేందుకు డిల్లింగ్​హామ్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిందని అధికారులు చెప్పారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.