మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్​ బుకింగ్​ షురూ..15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​

మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్​ బుకింగ్​ షురూ..15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​
  • తొలిరోజు 38 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9.28 లక్షల ఆదాయం

మంచిర్యాల, వెలుగు: సబ్​ రిజిస్ట్రార్​ఆఫీసులో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పడుతున్న బాధలు ఇక తీరినట్టే. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ ​బుకింగ్ ​విధానం ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతున్నాయి. మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులో సోమవారం స్లాట్​బుకింగ్ సిస్టం ప్రారంభమైంది. మొదటిరోజు 38 స్లాట్లు బుక్ కాగా, జాప్యం లేకుండా 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు. సేల్, రిలీజ్, మార్ట్​గేజ్, గిఫ్ట్​డీడ్​తదితర రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9.28 లక్షల ఆదాయం వచ్చింది.

మంచిర్యాల సబ్​ రిజిస్ట్రార్​గా ప్రియాంక పనిచేస్తుండగా అదనంగా మరొకరిని కేటాయించారు. కరీంనగర్​ ఆఫీసులో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న రాజిరెడ్డిని సెకండ్​ఎస్​ఆర్​గా నియమించారు. తొలిరోజు స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆదిలాబాద్​ జిల్లా రిజిస్ట్రార్​రవీందర్​రావు పర్యవేక్షించారు. 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తిచేసి డాక్యుమెంట్లు అందజేశామని ఆయన తెలిపారు. ప్రతి రోజు ఒక్కో ఎస్​ఆర్​కు 48 స్టాట్లు కేటాయించామని చెప్పారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. ఆన్​లైన్​లో https;//registration.telangana.gov.in ద్వారా స్లాట్​ బుకింగ్​ చేసుకోవచ్చని సూచించారు.