
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ సప్లయ్లు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో ఏడాది లెక్కన 25 శాతం పెరిగాయి. స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 8 శాతంగా ఉంది. సైబర్ మీడియా రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, వివో 20 శాతం మార్కెట్ షేర్తో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ను లీడ్ చేస్తోంది. శామ్సంగ్ 18 శాతం షేర్తో రెండో స్థానంలో, షియోమీ 13 శాతం మార్కెట్ షేర్తో మూడో స్థానంలో ఉన్నాయి. ఓప్పో 12 శాతం మార్కెట్ షేర్ను సాధించిందని సైబర్ మీడియా తెలిపింది.