
న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో సబ్స్క్రిప్షన్ ఆధారిత పర్సనల్ కంప్యూటర్ సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వారా సబ్స్క్రయిబర్లు తమ టీవీను సెట్-టాప్- బాక్స్ సహాయంతో పర్సనల్ కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. నెలవారీ ప్లాన్లు రూ.599 నుంచి ప్రారంభమవుతాయి. ఏడాది ప్లాన్కు రూ.4,599 చెల్లించాలి.
పీసీ సేవను పొందడానికి, జియోఫైబర్, జియో ఎయిర్ఫైబర్యూజర్లు యాప్ విభాగంలో జియో పీసీ యాప్పై క్లిక్ చేయాలి. 8జీబీ ర్యామ్, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉన్న పర్సనల్ కంప్యూటర్ను ఉపయోగించడానికి కీబోర్డ్, మౌస్ అవసరం. ఒక నెల ఉచిత ట్రయల్లో జియో వర్క్స్పేస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సేవలను పొందవచ్చు.