ఐడెంటిటీ ఆథెంటికేషన్ గా స్మార్ట్​ఫోన్లు

ఐడెంటిటీ ఆథెంటికేషన్ గా స్మార్ట్​ఫోన్లు

ముంబై: వ్యక్తుల ఐడింటిటీ నిర్ధారణకు స్మార్ట్​ఫోన్లనే యూనివర్శల్​ ఆథంటికేటర్​గా వాడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్​, ఐరిస్​, ఓటీపీలను ఆథెంటికేషన్ కోసం వాడుతున్నారు. ఈ స్కోప్​ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సీఈఓ సౌరభ్​ గర్గ్​ చెప్పారు. స్మార్ట్​ఫోన్లను ఆథంటికేటర్​గా వాడే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని, దీంతో ఎక్కడ నివశించే ప్రజలైనా ఆథంటికేషన్​ సులభంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశంలో 120 కోట్ల మొబైల్​ కనెక్షన్లుండగా,  80 కోట్ల స్మార్ట్​ఫోన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీలు రెండూ చాలా ముఖ్యమైనవిగా గర్గ్​ పేర్కొన్నారు. సింగిల్​ ఐడెంటిటీగా మారే దిశలో ఆధార్​ ప్రయాణిస్తోందని అన్నారు. ఆధార్​ ఆధారంగా చేపట్టిన డైరెక్ట్​ బెనిఫిట్​ ట్రాన్స్​ఫర్స్​ (డీబీటీ) వల్ల ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్లు ఆదా అయిందని, లీకేజ్​లు, డూప్లికేషన్​ అరికట్టడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకింగ్​, టెలికం రంగాలు రెండూ ఆధార్​ నెంబర్​ను బాగా అందిపుచ్చుకున్నాయని, 70 కోట్ల బ్యాంకు అకౌంట్లు ఆధార్​తో సీడ్​ అయ్యాయయని చెప్పారు. ఫుల్​ కేవైసీకి రూ. 3 , ఆథంటికేషన్​కు 50 పైసలు మాత్రమే ఇప్పుడు యూఐడీఏఐ ఛార్జ్​ చేస్తున్నట్లు గర్గ్​ వెల్లడించారు. ఇప్పటిదాకా దేశంలో 130 కోట్ల ఆధార్​ కార్డులున్నాయని, 99.5 శాతం జనాభా కవర్​ అయ్యారని, మిగిలిన వారికీ ఆధార్​ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గర్గ్​ వివరించారు.