దుబాయ్: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫెయిలైన ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ర్యాంక్ పతనమైంది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగు నుంచి ఐదో ర్యాంక్కు పడిపోయింది. అయితే ఈ సిరీస్లో రాణించిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని తిరిగి టాప్-10లోకి వచ్చింది.
వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ 22వ ర్యాంక్కు చేరుకుంది. కివీస్ స్టార్ ప్లేయర్ జార్జియా వోల్ 815 రేటింగ్ పాయింట్లతో టాప్ బ్యాటర్గా కొనసాగుతోంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ మూడో ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ బౌలర్ల విభాగంలో నాలుగో ప్లేస్కు చేరుకుంది.

