జైపూర్ : రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీహార్లోని భాగల్పూర్కు చెందిన అభిషేక్ కుమార్ కోటాలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి ప్రిపేర్ అవుతున్నాడు. శుక్రవారం హాస్టల్ గదిలో విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు హాస్టల్ కు చేరుకున్నారు. గదిలో సెర్చ్ చేయగా సూసైడ్ నోట్ దొరికింది.
అందులో ‘‘సారీ పాపా(నాన్న), నేను జేఈఈ చేయలేను’’ అని అభిషేక్ నోట్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. తన కోచింగ్ సెంటర్లో ఇటీవల జరిగిన రెండు పరీక్షలకు అభిషేక్ అటెండ్ కాలేదని తెలిపారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం కోటాకు ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు. అయితే, ఒత్తిడిని భరించలేక గతేడాది 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈ ఏడాది అభిషేక్ సహా మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.