రెసిడెన్షియల్, సెన్సిటివ్ఏరియాల్లోనూ అధికంగా నమోదు
గత రెండు నెలల్లో 20 –30 డెసిబుల్స్ ఎక్కువ
ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా నో రిజల్ట్స్
పరిమితికి మించితే డేంజర్ అంటున్న ఎక్స్ పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: సిటీలో సౌండ్పొల్యూషన్పెరిగిపోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మోత మోగుతోంది. సాధారణం కంటే అధికంగా డెసిబుల్స్రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, సెన్సిటివ్ఏరియాల్లోనూ నమోదు అవుతుంది. జూబ్లీహిల్స్, అబిడ్స్, తార్నాక, జేన్టీయూ, ప్యారడైజ్, సనత్నగర్, గడ్డపోతారం, జీడిమెట్ల, జూపార్క్, హెచ్ సీయూ ఏరియాల్లో సౌండ్ పొల్యూషన్ను పొల్యూషన్కంట్రోల్బోర్డ్(పీసీబీ) ప్రతినెలా లెక్కిస్తుంది.
గత జనవరి, ఫిబ్రవరిలో ఇండస్ట్రియల్, కమర్షియల్ ఏరియాలతో పాటు రెసిడెన్షియల్ ఏరియాలైన జూబ్లీహిల్స్, తార్నాక, సెన్సిటిల్ఏరియాలైన గచ్చిబౌలి, హెచ్సీయూ, జూపార్క్ ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం సాధారణం కంటే 20–30 డెసిబుల్స్ ఎక్కువగా నమోదు అవుతున్నట్టు స్పష్టమైంది. ఇందుకు కారణం.. రోజురోజుకు పెరిగిపోయే వాహనాలు, మోడిఫైడ్ సైలెన్సర్లు, పాత బండ్ల వాడకం వంటివి వాటితో పాటు సిటీ విస్తరణ కూడా సౌండ్ పొల్యూషన్పెరిగేలా చేస్తోంది. ఓవైపు సౌండ్ పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.
రెసిడెన్షియల్ ఏరియాల్లోనే ఎక్కువగా..
సిటీలో పది కమర్షియల్, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, సెన్సిటివ్ ఏరియాలను ప్రామాణికంగా తీసుకుని పీసీబీ ధ్వని తీవ్రతను లెక్కిస్తుంది. ప్రాంతానికో తీరుగా లెక్కిస్తుంది. జూబ్లీహిల్స్, తార్నాక ఏరియాలను రెసిడెన్షియల్ గా పరిగణిస్తుంది. సాధారణంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో డే టైమ్55 డెసిబుల్స్, నైట్టైమ్45 డెసిబుల్స్ఉండాలి. కానీ గత జనవరి, ఫిబ్రవరిలో డే అండ్ నైట్ తేడా లేకుండా సగటుకు 20 డెసిబుల్స్ పైనే పెరిగిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో కూడా సౌండ్పొల్యూషన్ అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే సెన్సిటివ్ ఏరియాల్లోనూ పెరిగింది.
అనారోగ్య సమస్యలు..
పరిమితిని మించిన సౌండ్స్ విన్నవారికి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమా దముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని పేర్కొంటున్నారు. అలాగే మెదడుపై దుష్ప్రభావం పడుతుందని, ఏకాగ్రతను దెబ్బతీస్తుందని అంటున్నారు. బ్లడ్ ప్రెషర్, నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయని, వృద్ధుల ఆరోగ్యంపైనా ఎఫెక్ట్ చూపుతుందని స్పష్టం చేస్తున్నారు.