సౌతాఫ్రికాతో రెండో టీ20..బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన

సౌతాఫ్రికాతో రెండో టీ20..బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన

ఫస్ట్ టీ20 గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. కాసేపట్లో గౌహతి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌‌లో ఓడిన సౌతాఫ్రికా...ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే తొలి మ్యాచ్ లో నెగ్గిన రోహిత్ సేన..ఈ మ్యాచ్ లోనూ గెలిచి..సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.  ఈ నేపథ్యంలో రెండో టీ20 ఉత్కంఠగా సాగే అవకాశం కనిపిస్తోంది.

 

భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్) KL రాహుల్,  కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్  పంత్ (wk), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అశ్విన్, దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్.

సౌతాఫ్రికా తుది జట్టు: డికాక్, (WK), బావుమా (కెప్టెన్), రోసో, మార్కరమ్, డేవిడ్ మిల్లర్, టీ స్టబ్స్, పార్నెల్, రబాడ, కేశవ్ మహరాజ్, నోర్ట్జే.