లాక్డౌన్ను వాడుకున్న ఎస్సీఆర్
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్తో రైళ్లు రద్దవడంతో దొరికిన ఖాళీ టైమ్ను దక్షిణ మధ్య రైల్వే సమర్థంగా వాడుకుంది. ట్రాకుల రిపేర్ పనుల్లో ఇండియన్ రైల్వేస్లోనే తొలి స్థానంలో నిలిచింది. జోన్లో మరమ్మతులు చేయాల్సిన సెక్షన్లను గుర్తించి రైలు పట్టాలు, క్రాసింగ్లు, స్లీపర్లు, బలాస్ట్లను మెరుగుపర్చింది. జోన్లో 984 కిలోమీటర్ల పట్టాలను బాగు చేశారు. పట్టాలు ఒక లైన్ నుంచి మరో లైన్కు మారేచోట, రెండు లైన్లు కలిసే చోట ఉండే క్రాసింగ్స్, పాయింట్స్అలైన్మెంట్ను సరి చేశారు. రైలు పట్టాల కింద చెత్తను తీసి మంచి బలాస్ట్ నింపే పనులను 83 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. దీంతో రైళ్ల వేగాన్ని మరింత పెంచవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ చెప్పారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పెళ్లి పేరుతో యువకుడికి వల.. రూ.65 లక్షలు నొక్కేసి..
ఇవాళ కొండపోచమ్మ సాగర్కు నీళ్లు