సోయా రైతులను ఆదుకోవాలి

సోయా రైతులను ఆదుకోవాలి

భైంసా, వెలుగు:  వైరస్​ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్​ చేశారు.  భైంసాలో ఏడీఏ వీణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కేడీఎస్, ఈగల్​ కంపెనీలకు చెందిన సోయా విత్తనాలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆ కంపెనీలపై చర్యలు తీసుకొని, తక్షణమే నష్టపరిహారం అందించాలన్నారు. 

లేనియేడల బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, పోశెట్టి, సంపత్​ పటేల్​, రఘువీర్​, నందు భయ్యా, లక్ష్మణ్​, అనిల్, రైతులు​ తదితరులున్నారు.