
ఆదిలాబాద్, వెలుగు: ప్రతిరోజు గ్రామాలను సందర్శిస్తూ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని -ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న భీంపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. సరిహద్దుల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జైనథ్ మండలం పిప్పర్ వాడ చెక్పోస్టును పరిశీలించారు. అక్రమంగా పశువుల రవాణా జరగకుండా చూడాలని, 24 గంటలు వాహనాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో 8 చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
జాగిలాల కోసం స్విమ్మింగ్ ఫూల్ ప్రారంభం
ఆదిలాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 8 జాగిలాల బృందానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్విమ్మింగ్ ఫూల్ను గురువారం ఎస్పీ ప్రారంభించారు. జాగిలాలు విధులు నిర్వర్తించి సేద తీరడానికి ఈ స్విమ్మింగ్ పూల్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి, చంద్రశేఖర్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.