లిక్కర్ స్కాం నుంచి కవితను కాపాడుకునేందుకు సీఎం డ్రామా ఆడుతున్నరు: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజీ స్వామి సీఎం కేసీఆర్ కోవర్ట్అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. పాత ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో వివేక్ మాట్లాడుతూ.. సింహయాజీ, అతని మిత్రులతో కేసీఆరే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడించినట్లు క్లియర్గా అర్థమవుతోందని అన్నారు. ‘‘గతంలో స్వామిజీ నా ఇంటికి వచ్చి.. రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి పెరిగింది, కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తరు అని చెప్పారు. అప్పుడే అతను కేసీఆర్ కోవర్ట్ అని నాకు అర్థమైంది.
ఆ తర్వాత అతనితో కమ్యూనికేషన్కట్ చేశాను. చాలా సార్లు ఫోన్ చేసినా నేను పట్టించుకోలేదు” అని వివేక్ వివరించారు. ఆ డబ్బులు, స్వామీజీ, ఎమ్మెల్యేలు అన్ని కేసీఆర్ కుట్రలో భాగమేనని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన కూతురు కవితను కాపాడుకునేందుకు కేసీఆరే ఈ డ్రామా ఆడించారని అన్నారు. ఈ కేసులో స్వామీజీకి ప్రగతి భవన్కు మధ్య ఉన్న కాల్ రికార్డులు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కేసులో నిందితుడు టీఆర్ఎస్ నేతలతో ఎందుకు కలిసి ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు.