భారత్ సాయానికి ధన్యవాదాలు.. మీ వల్లే మా దేశస్థులను కాపాడగలిగాం

భారత్ సాయానికి ధన్యవాదాలు.. మీ వల్లే మా దేశస్థులను కాపాడగలిగాం

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా సూడాన్‌ ఓడరేవుకు దాదాపు 500 మంది వరకు భారతీయులు చేరుకున్నారు.

ఈ క్రమంలో భారత్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. శ్రీలంకకు అండగా నిలిచింది. శ్రీలంక దేశస్థులను సూడాన్ నుంచి తరలించడానికి శ్రీలంక ప్రభుత్వానికి భారత్ సహకారం అందిస్తోంది. ఈ విషయంపై శ్రీలంక.. భారత్ కు ధన్య వాదాలు తెలిపింది. భారత్ సాయంతో మరికొన్ని రోజుల్లో శ్రీలంక దేశస్థులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలమని శ్రీలంక ధీమా వ్యక్తం చేసింది.