శ్రీలంకదే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌

శ్రీలంకదే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌

 సిల్హెట్‌‌‌‌‌‌‌‌ : బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కాసున్‌‌‌‌‌‌‌‌ రజిత (5/56), విశ్వా ఫెర్నాండో (3/36), లాహిరు  కుమార (2/39) చెలరేగడంతో.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక 328 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో లంకేయులు 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. 511 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో 47/5 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో సోమవారం నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 49.2 ఓవర్లలో 182 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

మోమినల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (87*) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ మిరాజ్‌‌‌‌‌‌‌‌ (33) పోరాడాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. ధనంజయ డిసిల్వాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 30 నుంచి చట్టోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.