పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి : శ్రీధర్​బాబు

పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి : శ్రీధర్​బాబు

పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీధర్​బాబు పిలుపునిచ్చారు. ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్​ హైకమాండ్​ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది. కాకా వెంకటస్వామి మనుమడిగా, వివేక్​ వెంకటస్వామి కొడుకుగా, యువతకు స్ఫూర్తిగా నిలువాలని రాజకీయాల్లోకి వచ్చిండు. 

కొంతమంది రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వచ్చిండని అంటున్నరు. కానీ అతడు చిన్న వయసులోనే సక్సెస్​ఫుల్​ బిజినెస్​ మ్యాన్​గా గుర్తింపు తెచ్చుకున్నడు. తనకున్న అనుభవం, నైపుణ్యం, మేధాశక్తితో ఈ ప్రాంత యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశయంతో ఉన్నడు. ప్రజాసేవ కోసం వచ్చిన వంశీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి పార్లమెంట్​ సెగ్మెంట్​పరిధిలోని ఎమ్మెల్యేలందరం ఆయనకు మద్దతునిస్తున్నాం. 

బీజేపీ, బీఆర్ఎస్​ అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటు వేయండి. మీలో ఒకడిగా ఉంటడు. ఢిల్లీలో ఏ పని ఉన్నా చేసి పెడ్తడు. గ్రామాలకు వెళ్లి వంశీ గురించి ప్రజలకు చెప్పండి. మీరందరు అతడిని  ఆశీర్వదించండి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే డబుల్​ మెజారిటీతో గెలిపించండి’’ అని పిలుపునిచ్చారు.