
కొత్తకోట, వెలుగు: తన భార్య మెడలో ఉన్న గోల్డ్ బ్యాంకులో కుదవపెట్టి ఓ వ్యక్తి లోన్ తీసుకోగా, బ్యాంకులోనే చోరీకి గురైన ఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ ఆనంద్ కథనం ప్రకారం.. అడ్డాకుల మండలం కన్మనూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు కొత్తకోటలోని యూనియన్ బ్యాంకులో తన భార్య గోల్డ్ పెట్టి రూ.లక్ష లోన్ తీసుకున్నాడు. అనంతరం వాటిని జేబులో పెట్టుకున్నాడు. అదే బ్యాంకులోని మరో కౌంటర్ వెళ్లి చూసేసరికి డబ్బులు కనిపించలేదు.
బ్యాంకులో వెతికినా దొరకలేదు. దీంతో డబ్బులను ఎవరో చోరీ చేశారని గుర్తించి శ్రీనివాసులు కొత్తకోట పీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.