
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన కంపెనీ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ షేర్లు బంపర్ బోణి కొట్టాయి. 141 శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. చివరికి ఇవి 153 శాతం లాభంతో రూ.106.55 వద్ద ముగిశాయి. ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్లో లిస్ట్ అయ్యాయి. శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఐపీఓ ఆగస్ట్ 7 – ఆగస్ట్ 9 మధ్య సబ్స్క్రిప్షన్కు వచ్చింది. ఇష్యూ ఏకంగా 450 రెట్లు సబ్స్క్రయిబ్ అయింది. ఐపీఓ సైజు రూ.9.00 కోట్లు కాగా, ప్రైజ్బ్యాండ్ను రూ.40–రూ.42 మధ్య నిర్ణయించారు.