
- ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ కంపెనీకి గ్రీన్సిగ్నల్
- లైసెన్స్ జారీ చేసిన టెలికాం డిపార్ట్మెంట్
- ఇండియా డేటాను ఇక్కడే నిల్వ చేయాలని షరతు
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్.. ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్(జీఎంపీసీఎస్) లైసెన్స్ పొందింది. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియాలో ఈ లైసెన్స్ పొందిన 3వ సంస్థగా స్టార్లింక్ నిలిచింది. ఇంతకుముందు భారతి ఎయిర్టెల్కు చెందిన యూటెల్సాట్ వన్వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్కు ఈ లైసెన్స్ లభించింది. అమెజాన్కు చెందిన కూపర్ ప్రపోజల్ ఇంకా టెలికాం డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్నది.
కాగా, స్టార్లింక్కు మేలోనే లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. తాజాగా జీఎంపీసీఎస్ లైసెన్స్ అధికారికంగా మంజూరు చేసింది. ఈ లైసెన్స్ పొందిన తర్వాత, స్టార్లింక్ 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రయల్ స్పెక్ట్రం స్టార్లింక్ సేవలు దేశ భద్రతా నిబంధనలను పాటిస్తున్నాయని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఇండియాలోని డేటాను దేశంలోనే నిల్వ చేయాలని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అవసరమైతే డేటా ఇంటర్సెప్షన్కు అవకాశం కల్పించాలని స్టార్లింక్కు ఇండియన్ గవర్నమెంట్ షరతు విధించింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్స్పాక్) నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంది. ఈ ప్రక్రియ
కూడా చివరి దశలో ఉన్నట్లు తెలుస్తున్నది.