జనగామలో రాష్ట్ర స్థాయి నెట్​బాల్​ పోటీలు షురూ

జనగామలో రాష్ట్ర స్థాయి నెట్​బాల్​ పోటీలు షురూ

జనగామ, వెలుగు: జనగామలోని బతుకమ్మ కుంటలో శుక్రవారం రాష్ట్ర స్థాయి సబ్​ జూనియర్స్​​నెట్​బాల్  చాంపియన్​షిప్​​ పోటీలు ప్రారంభమయ్యాయి. నెట్​బాల్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. 

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేర్వేరుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.