తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ బదిలీ

తెలంగాణ సీఈవో శశాంక్ గోయల్ బదిలీ

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ను బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గోయల్ ను కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. 1990 బ్యాచ్ కు చెందిన శశాంక్ గోయల్.. గతేడాది మే నెలలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన విధులు నిర్వర్తించారు. అలాగే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గానూ పనిచేశారు.

మరిన్ని వార్తల కోసం: 

ఐదు రోజుల బేబీకి కరోనా టెస్ట్

ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో జై భీమ్

కరోనా కల్లోలం.. భారీగా పెరుగుతున్న కేసులు