
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలో కలిశారు ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్, చల్లా వంశీచంద్ రెడ్డి. తెలంగాణలో తాజా రాజకీయ అంశాలపై సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పనితీరు అంశాల గురించి 20 నిమిషాలపాటు సోనియాతో చర్చించినట్టు నాయకులు చెప్పారు.