
- ట్రంప్ బెదిరింపులకు భయపడేదే లేదు..
- మాపై దాడి చేసి ఇజ్రాయెల్ భారీ తప్పు చేసింది
- వారిపై కనికరం లేకుండా దాడులు చేస్తూనే ఉంటం
- ఎవరికో భయపడి యుద్ధం ఆపబోం..
- రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తం
- అమెరికా దాడి చేస్తే కోలుకోలేని దెబ్బకొడ్తం
- ట్రంప్కు ఎక్స్లో ఖమేనీ స్ట్రాంగ్ కౌంటర్
- ఖడ్గంతో కోట గేటు వద్ద ఉన్న వ్యక్తి ఫొటో పోస్ట్
టెహ్రాన్: అటు ఇజ్రాయెల్ దాడులు.. ఇటు ట్రంప్ వార్నింగ్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. యుద్ధం మొదలైందని, తాము ఎవరికో భయపడి లొంగిపోయే ప్రసక్తే లేదని అన్నారు. ఇరాన్పై దాడికి దిగి ఇజ్రాయెల్ భారీ తప్పిదం చేసిందని తెలిపారు. అందుకు శిక్ష తప్పదని, ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు.
ఇజ్రాయెల్భీకర దాడులతో ఫ్యామిలీతో కలిసి బంకర్లోకి వెళ్లిపోయిన ఖమేనీ బుధవారం టెలివిజన్ ద్వారా వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘‘జియోనిస్ట్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఇజ్రాయెల్ చేసిన తప్పుకు శిక్ష తప్పదు. ఇరాన్ గడ్డపై చిందిన అమరవీరుల రక్తం మమ్మల్ని ప్రతీకారం తీర్చుకోకుండా ఉండనివ్వదు. రక్తానికి రక్తంతోనే సమాధానమిస్తం. ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంటాం” అని హెచ్చరించారు.
ట్రంప్ మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఖమేనీ ఘాటుగా స్పందించారు. అలాంటి బెదిరింపులకు భయపడబోమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన ఎవ్వరికైనా అర్థమవుతుందన్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల్లో అమెరికా సైన్యం కనుక జోక్యం చేసుకుంటే కోలుకోలేని విధంగా దెబ్బకొడ్తామనే విషయం వారు తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మాతృభూమిని కాపాడేందుకు ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ట్రంప్కు వార్నింగ్
ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, కానీ ఇప్పట్లో ఆయనను చంపే ఆలోచన లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఖమేనీ స్పందించారు. ‘యుద్ధం మొదలైంది’ అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘నమి పేరుతో యుద్ధం స్టార్ట్అయింది. అలీ తన జుల్ఫికర్తో(కత్తి) కలిసి ఖైబర్కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. అలాగే, చేతిలో ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫొటోను ఆ పోస్ట్కు యాడ్ చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా బ్యాక్గ్రౌండ్ఫొటో ఉంచారు. ఏడో శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమామ్ యుద్ధం చేసి.. అందులో విజయం సాధించారు.
దాన్ని గుర్తుచేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ పెట్టారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్పేర్కొన్నది. కాగా.. జియోనిస్ట్ పాలనకు తాము గట్టిగా బదులిస్తామని మరో పోస్ట్లో ఖమేనీ హెచ్చరించారు. ఎవరిపైనా దయచూపేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అధికారులు పరోక్ష చర్చల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్తమపై దాడి చేసిందని మండిపడ్డారు. తమనుంచి ఎలాంటి ఇండికేషన్స్లేకున్నా వారు అటాక్ చేశారన్నారు. ఇజ్రాయెల్ దుందుడుకు చర్య వెనుక మొదట అమెరికా ఉందని అనుమానించాం.. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే తమ అనుమానాలు నిజమేనని తేలిందన్నారు. ఎవరికో భయపడి తాము యుద్ధం ఆపబోమని, ఇజ్రాయెల్పై ప్రతిదాడి చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
ఇరాన్ సైన్యానికి సర్వాధికారాలు
ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన సర్వాధికారాలను ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)కి అప్పగించారు. ఇరాన్ ఇన్సైట్ ప్రకారం.. ఖమేనీ, అతని కొడుకు మోజ్తాబాతో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈశాన్య టెహ్రాన్లోని భూగర్భ బంకర్ లో తలదాచుకుంటున్నారు.
హైపర్ సోనిక్ మిసైల్.. ఫతా-1
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు చిల్లు పెడుతూ, మొస్సాద్ హెడ్ క్వార్టర్స్ ను పేల్చేసిన ఇరాన్ ఫతా-1 క్షిపణి హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ రకానికి చెందినది. ఇరాన్ దీనిని 2003లో లాంచ్ చేసింది. ఫతా అనేది అల్లాకు ఉన్న 99 పేర్లలో ఒకటి. అలాగే దుర్భేద్యమైన విజయాలకు ద్వారాలు తెరిచేది అని కూడా అర్థం. దీనికి ఈ పేరును పెట్టింది ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీయేనని చెప్తారు.
12 మీటర్ల పొడవైన ఈ క్షిపణి 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి.. గరిష్టంగా1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ తో కూడిన ఫతా-1క్షిపణి ఏకంగా మ్యాక్ 15(సుమారు గంటకు18 వేల కి.మీ.) స్పీడ్తో ప్రయాణిస్తుందని అంచనా. అందుకే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సైతం దీనిని అడ్డుకోలేకపోతోందని చెప్తున్నారు.