భద్రాద్రికొత్తగూడెంలో జిల్లా ఉత్సాహంగా స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు

 భద్రాద్రికొత్తగూడెంలో జిల్లా ఉత్సాహంగా స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు
  • సెమీస్ బెర్త్​ఖాయం చేసుకున్న  ఉమ్మడి ఖమ్మం బాలబాలికలు

పినపాక, వెలుగు : అండర్​–-19 బాలబాలికల 69వ స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్లబయ్యారం జడ్పీ హైస్కూల్ గ్రౌండ్​లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. ఫూల్​-ఏ, ఫూల్​బీగా జట్లను విభజించి నిర్వహించిన లీగ్​మ్యాచ్​లు నేటితో ముగిశాయి. బాలుర విభాగం నుంచి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్​నగర్, బాలికల విభాగం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం టీమ్​లు సెమీస్​కు చేరినట్లు పీడీ బి.వీరన్న తెలిపారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బాలబాలికల టీమ్​లు సెమీస్​కు చేరడం విశేషం. కబడ్డీ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సురేశ్, టీఎస్​ఎస్పీ బెటాలియన్​పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోటీలను తిలకించి క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. రాత్రి క్యాంప్ ఫైర్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్కూల్ హెచ్ఎం కొమరం నాగయ్య తెలిపారు.